బిజెపి నాయకులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగోలు

Spread the love
BJP party leaders buy BRS party MLAs

సాక్షిత : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కోనుగోలను నిరసిస్తూ శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశాలమేరకు దొడ్ల రామకృష్ణ గౌడ్ ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద తెరాస నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాళ్లతో కలిసి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ బిజెపి నాయకులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమే అని అన్నారు. మునుగుడులో బిఆర్ఎస్ పార్టీ గెలుపు తధ్యమని భావించిన బిజెపి నాయకులు ఇలాంటి దూరాఘాతాలకు పాల్పడుతున్నారని అన్నారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర మరియు కాశినాథ్ యాదవ్, బోయాకిషన్, షౌకత్ అలీ మున్నా, ప్రదీప్ రెడ్డి, కైసర్, సమ్మద్, అగ్రవాసు, రాములుగౌడ్, వాసుదేవరావు, మల్లేష్, ఖాజా, అంజిరెడ్డి, సత్యనారాయ, అశోక్, కరుణాకర్, రవీందర్, కూర్మయ్య, కటికరవి, బాలరాజు, అర్వరవి, శామ్యూల్, సాయిగౌడ్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, ప్రీతి, రేణుక, స్వప్న, నస్రీన్, పద్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page