మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపల్ అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు రాంపల్లి, ఆర్టీసీ కాలనీ, ఆర్ ఎల్ నగర్, ఓయూ కాలనీలో 300 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అధికార దాహం కోసం యత్నిస్తున్న కాంగ్రెస్ కు ఓటమి తప్పదని అన్నారు.నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 యేళ్ళుగా ప్రజలను వంచనకు గురి చేసిందని ఆయన ఆరోపించారు.బిజేపి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో బిజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికి అవకాశం ఇచ్చారు. ఈ సారి నాకు ఓ అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు
బీఆర్ఎస్, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి
Related Posts
కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు
SAKSHITHA NEWS కమిషన్ లు లెంది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరుసవాల్ ను స్వీకరిస్తూన్నాం …..చర్చకు రండి – మాజీ ఎంపీటీసీ తిరుపతి సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-….కమిషన్ లు లేనిది బి.ఆర్.ఎస్ నాయకులు పని చేయరు అని జీవోను మీ ప్రభుత్వ…
ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.
SAKSHITHA NEWS ఓపెన్ స్కూల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలి.మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అధికారుల సమీక్షకు నివేదికలు సిద్ధం చేయాలి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్…