గుంటూరు ప‌శ్చిమ‌లో టీడీపీకి భారీ షాక్‌

Spread the love

గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంపార్టీకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ఇది పెద్ద ఎదురుదెబ్బే.

ఆ పార్టీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు శుక్ర‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆధ్వ‌ర్యంలో, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వీరిని ఆప్యాయంగా ప‌లుక‌రించి , కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్‌.టి.రాజపురం నైట్‌ స్టే పాయింట్ వ‌ద్ద ఈ చేరిక‌లు. బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా క‌లిసిన నేత‌లు

టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారి వివ‌రాలు

1.మాజీ కార్పొరేట‌ర్ ఎస్‌. కె. సైదా (గుంటూరు న‌గ‌ర మాజీ మేయ‌ర్ అభ్య‌ర్థి కూడా)
2.మొండి బండ సంఘం జిల్లా అధ్య‌క్షుడు పి.కృష్ణ‌
3.టీడీపీ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు మేక‌ల మాధ‌వ‌యాద‌వ్ మ‌రియు ఇత‌ర నేత‌లు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page