జనసేన పార్టీకి బిగ్ షాక్…

Spread the love

36వ డివిజన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మూకుమ్మడిగా వలసలు…

భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో చేరిక..

తిరుపతి

సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ
జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. స్థానిక 36 వ డివిజన్ కు చెందిన జనసేన పార్టీ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జనసేన నాయకులు
చిన్నబ్బ రెడ్డి, పీ జీవమణి, పీ జీవముని, వెంకటేష్, చంద్ర, మణీ, అంబేద్కర్, శంకర్, నారాయణ, సాయి, పళణి, కళ్యాణ్, అర్జున్ రెడ్డి, శీన, విజయ, శెల్వా తదితరులు ఆ పార్టీని వీడి… నాయకుడు కొత్తప్ప ద్వారకనాధ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక అనంతవీధిలో బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి వారికి కండువాలు కప్పి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ ని అఖండ మెజారిటీతో గెలిపించు కుంటామని వారంతా ముక్తకంఠంతో ప్రకటించారు.

Related Posts

You cannot copy content of this page