SAKSHITHA NEWS

భారత స్వత్రంత్ర ఉద్యమ స్ఫూర్తి భావి తరాలకు బోదించాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించిన ప్రీడం రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

▪️ మొదటగా ఆకుపచ్చ జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

▪️ తెలంగాణ ప్రభుత్వం 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 15 రోజులపాటు డైమండ్ జూబ్లీ నిర్వహిస్తుందన్నారు.

▪️ భారత స్వత్రంత్ర ఉద్యమ స్ఫూర్తి భావి తరాలకు బోదించాలని అది ప్రతి భారతీయుడి భాద్యత అన్నారు. నాటి అమరుల త్యాగ ఫలితమే నేటి సుందరమైన స్వతంత్ర భారతం అన్నారు.

▪️ అనంతరం జాతీయగీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల , జిల్లా ఎస్పీ కోటిరెడ్డి , ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS