పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి

Spread the love

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

భారతీయ సమాజానికి బాబూ జగ్జీవన్‌ రామ్‌ చేసిన సేవలు అపారమైనవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి పురస్కారించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సమాజ అభివృద్ధికి అవిశ్రాంతంగా చేసిన కృషిని స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న జగ్జీవన్‌రామ్‌ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్న కుమార్, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page