సాక్షిత : బిసి ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ లు హెచ్చరించారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో పలువురు బిసి ప్రజాప్రతినిధులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బిసి ప్రజాప్రతినిధులు, నాయకులపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను ముక్త కంఠమ్ తో ఖండించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, ఎల్.రమణ, బసవరాజ్ సారయ్య, శంభీపూర్ రాజు, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, MP లు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బిబి పాటిల్, కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ లతో పాటు ఇంకా పలువురు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిసి లు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించే విధంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. బిసి ల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా బిసి కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించడంతో పాటు నిధులను కూడా ఇచ్చిందని చెప్పారు. అదేవిధంగా కులవృత్తులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తూ వస్తుందని వివరించారు. అనేక విధాలుగా తమ ఎదుగుదలకు అండగా నిలిచినా BRS పార్టీ వెంట లు ఉన్నారని, దీన్ని జీర్ణించు కోలేక బిసి ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం బిసి లను కేవలం ఓటు బ్యాంకు గానే చూశారని, వారి అభివృద్దిని విస్మరించిందని విమర్శించారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాజకీయాలలో విమర్శ, ప్రతి విమర్శ సహజంగా ఉంటాయని, ఈ విధమైన వ్యక్తిగత, నోటికొచ్చిన పదాలను వాడటం సరైన విధానం కాదని హితవు పలికారు. బిసి ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యక్తిగత, కుల వృత్తులను కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ విధానమా ? అనేది పార్టీ అధినాయకత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజులలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు గల అన్ని బిసి సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించి ఏకం చేస్తామని, త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ను రూపొందించి ప్రకటిస్తామని చెప్పారు. మా ఓట్లతో గెలిచి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గ్రామాలలో తిరగనీయకుండా అడ్డుకుంటామని అన్నారు. బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. తమ జోలికి వస్తే అన్ని బిసి సామాజిక వర్గాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయని హెచ్చరించారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకొని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. 130 సంవత్సరాల చరిత్ర తమ పార్టీది అని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకోవడం కాదని, పార్టీ నాయకులు మాట్లాడే బాషను మార్చుకోవాలని, అలాంటి వారిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. బిసి లు అంటే అసమర్ధులు అనుకోవద్దని, తాము బాద్యతాయుతమైన పదవులలో ఉన్నందున హుందాగా నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తమను తక్కువ అంచనా వేయవద్దని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఎంతవరకైనా వెనుకాడబోమన్నారు. బిసి లు జనాభాలో 56 శాతం ఉన్నారన్న విషయాన్ని మరచిపొవద్దని, రానున్న రోజులలో మా సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.
Related Posts
Spread the love హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల బంగారం, 40కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో…
Spread the love భువనగిరి ఎంపీ అభ్యర్థి చామలా కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపహాడ్ గ్రామానికి చెందిన నామాల రవి తాటిచెట్టు మిది నుండి కింద పడి వెన్నుపూస విరగడం వలన మంచానికి పరిమితమైన నామాల రవి కుటుంబానికి…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి
Spread the love సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగారాలి, బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో గెలవాలి- ఎనుముల కృష్ణారెడ్డి & రఘునాథ్ యాదవ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీనియర్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం…
Spread the love మైనార్టీల సంక్షేమ కోసం పనిచేసే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి మద్దతునివ్వండి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 129 – సూరారం డివిజన్ కళావతి నగర్ మహమ్మదీయ మజీద్ గల్లీలో బిఆర్ఎస్ ఎంపీ…
Spread the love తెలుగు రాష్ట్రాల్లో మే 13న అంటే పోలింగ్ నాటికి ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికోసం EC.. ఓటర్లకు కొన్ని సూచనలు జారీచేశారు. ఉదయం పోలింగ్ ప్రారంభంకాగానే ఓటు హక్కు వినియోగించుకోండి. ఉదయం ఓటేయడం…
Spread the love బుల్కాపూర్, చిన్న శంకర్పల్లి వార్డులలో ఎన్నికల ప్రచారం: నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి భీమ్ భరత్ సాక్షిత శంకర్పల్లి:దేశంలో, రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ ఇన్చార్జ్ బీమ్…
Spread the love కొండాపూర్ మండల పరిధి మన్ సాన్ పల్లి, మునిదేవునిపల్లి, గొల్లపల్లి, గుంతపల్లి, గడి మల్కాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త కొండాపూర్: ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలవాలని, తమ…
Spread the love మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి .ఈ ప్రచారంలో పార్లమెంటు ఇంఛార్జ్ మైనంపల్లి…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్…
Spread the love పరోక్షంగా వద్దు.. ప్రత్యక్షంగా విచారించండి: కవితఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా కీలక విషయాలను రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత దరఖాస్తు చేశారు. తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపర్చవద్దని.. కేసు విచారణ వేళ…