SAKSHITHA NEWS

అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితుల అరెస్ట్

— అయిదుగురు నిందితులు ఒక మహిళా నిందితురాలు అరెస్ట్

–వీరి వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువ గల 43 గంజాయి ప్యాకెట్లు, 5 సెల్ ఫోన్ ల ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

— జిల్లా కార్యాలయంలో వివరాలు వెల్లడించిన యస్.పి అపూర్వరావు ఐపిఎస్

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

అక్రమంగా గంజాయి తరలింపు పై నల్లగొండ జిల్లా పోలీసులు ప్రత్యేకంగా పెట్టారు. నిరంతర నిఘా లో బాగంగా నల్గొండ జిల్లా యస్.పి అపూర్వ రావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం మరియు కేతపల్లి పోలీసులు విశ్వసనీయ సమాచారంతో సోమవారం తెల్లవారుజామున కేతపల్లి పిఎస్‌ పరిధిలోని ఎన్‌హెచ్ 65 లోని కొర్లపాడ్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసు వారిని చూసి కొద్ది దూరం లో బస్సు ని ఆపి పారిపోవూటకు ప్రయత్నించగా అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొని తనికి చేయగా వారి బ్యాగ్ లలో 43 గంజాయి ప్యాకెట్ల 103 కిలోలు (సుమారు విలువ 10 లక్షల రూపాయలు) గంజాయిని స్వాధీనం చేసుకొని వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒరిస్సా నుండి హైదరాబాద్ కి వెళ్తున్న ప్రయివేట్ బస్సులో మల్కాంగిరి నుండి గంజాయి ని హైదరాబాద్ కు తరలించున్నామని, వీరు మాల్కంగిరి ఒరిస్సా స్టేట్ కి చెందిన గంజాయి వ్యాపారం చేసే వినయ్ ద్వారా ఈ యొక్క గంజాయిని హైద్రాబాద్ లో వినయ్ కి తెలిసిన వ్యక్తి వివేక్ కు సరఫరా చేయుటకు వెళ్తున్నామని చెప్పగా,ఇందుకు గాను వీరికి ఒక్కొకరికి 10 వేల రూపాయలనీ ఇస్తారని మరియు ప్రయాణ ఖర్చులు కూడా ఇస్తారు. అదే విదంగా జీవన్ సింగ్ కూడా మాల్కంగిరి లోనే గంజాయి ని కొని, ఇధే బస్సు లో గంజాయి ని హైదరాబాద్ కి అక్కడి నుండి మధ్య ప్రదేశ్ కు తీసుకొని వెళ్ళి చిన్న చిన్న ప్యాకేట్లు చేసి అక్కడ తెలిసిన వారికి ఎక్కువ లాబానికి అమ్ముకుంటాడని తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్ కు పంపడం జరిగింది.

నిందితుల వివరాలు:

  1. అశోక్ తారఫ్దర్, వయసు25, వృత్తి సెంట్రింగ్ వర్క్ గ్రామం పొడియా, మాల్కంగిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం.
  2. అబిజిత్ తారఫ్దర్ వయసు 20, వృత్తి విద్యార్ది,
    గ్రామం పొడియా, మాల్కంగిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం.
  3. ఫణి తారఫ్దర్ వయసు 27, వృత్తి సెంట్రింగ్ వర్క్ గ్రామం పొడియా, మాల్కంగిరి జిల్లా, ఒరిస్సా రాష్ట్రం.
  4. జీవన్ సింగ్ యాదవ్, వయసు 32 వృత్తి వ్యవసాయం గ్రామం లక్ష్మీకేదా అగర్ మాల్వా మండలం, శజపూర్ జిల్లా, మద్యప్రదేశ్ రాష్ట్రం
  5. ధనుజయ్ బిశ్వాస్ వయసు 30, వృత్తి సెంట్రింగ్ ,బాపన్న పల్లి, మాల్కంగిరి, ఒరిస్సా రాష్ట్రం.
  6. శిఖా బిశ్వాస్ వయసు 29, బాపన్పల్లి , కలిమెల మాల్కంగిరి, ఒరిస్సా రాష్ట్రం. మరో ఇద్దరు నిందితులు ఒరిస్సా కు చెందిన వినయ్, హైదరాబాద్ చెందిన వివేక్ లు పరారీలో ఉన్నట్లు యస్.పి అపూర్వరావు తెలిపారు. ఈ కేసు లో నల్లగొండ డి‌ఎస్‌పి నర్సింహ రెడ్డి పర్యవేక్షణలో శాలిగౌరారం సి‌ఐ రాఘవ రావు, కేతేపల్లి ఎస్‌ఐ అనిల్ రెడ్డి, సిబ్బంది అంజాద్, నాగేశ్వర రావు, కిశోర్, సురేశ్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినంధించారు.

SAKSHITHA NEWS