పకడ్బందిగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు

Spread the love

arrangements-for-immersion-of-ganesh-

పకడ్బందిగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు

ప్రశాంతతకు మారుపేరు సూర్యాపేట

నిమజ్జన వేడుకలతో ఆ పేరు నిలబెట్టాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి
సాక్షిత : సూర్యాపేట లోని సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.


ప్రశాంతత కు మారు పేరు సూర్యాపేట పట్టణం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఆనందోత్సవాల మధ్య ప్రశాంత వాతావరణం లో గణేష్ నిమజ్జనం వేడుకలను పూర్తిచేసుకుని సూర్యాపేట వాసులకు తమకు ఉన్న పేరు ను నిలబెట్టుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. రేపు సూర్యాపేట లో జరగనున్న గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను సద్దుల చెరువు టాంక్ బండ్ వద్ద మంత్రి పరిశీలించారు.

మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ , మున్సిపల్ కమిషనర్ సత్నారాయణ రెడ్డి ఇతర శాఖ ల అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పట్టణం లో ఇప్పటికే గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైందని, రేపు జరిగే ప్రధాన నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణం లో విజయవంతం చేయడం ద్వారా ఐక్యమత్యానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సూర్యాపేట ఖ్యాతిని మరోసారి పెంపొందించేందుకు ప్రతిఒక్కరం సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ ప్రత్యేకతను కాపాడటానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని పేర్కొన్నారు. సద్దుల చెరువు ట్యాంక్ బండ్ లో దాదాపు కు పైగా విగ్రహాల నిమజ్జనం జరుగుతాయని, ప్రధానంగా నిమజ్జన కార్యక్రమం సందర్భంగా శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా మున్సిపల్ , విద్యుత్, పోలీసు, రోడ్లు, భవనాలు, రెవిన్యూ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.


గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, రోడ్ల మరమ్మతులు, శోభయాత్ర జరిగే రహదారులలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్టు వివరించారు. ప్రత్యేక శానిటేషన్ బృందాలను ఏర్పాటుచేసి నిమజ్జన శోభయాత్ర మార్గంలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం చేపడుతామనిఅన్నారు. ట్యాంక్‌బండ్‌పై గ‌ణేష్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నానికి ప్రత్యేక క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు.. దారి మళ్లింపు, నిమజ్జన ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలు, ప్రజలు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలపై ముందే ప్రజలకు పూర్తి స్థయిలో అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.వినాయక నిమజ్జనాలు అత్యంత ప్రశాంతంగా జరిగేట్లు చూడాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలేని జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. వినాయక మండపాల బాధ్యులకు ముందుగానే తగు సూచనలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్, అయూబ్ ఖాన్, ఎల్గూరి రాంబాబు, దేశాగాని శ్రీనివాస్ గౌడ్, కీసర వేణుగోపాల్ రెడ్డి, అనీల్ రెడ్డి మదిరెడ్డి రామా కిరణ్, రఫీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page