అన్నేపెర్తి.. గ్రామం..

Spread the love

పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకోని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు మాజీ మంత్రి , సూర్యపేట mla జగదీశ్ రెడ్డి.. నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో మాజీ mla భూపాల్ రెడ్డి తో కలిసి ఎండిన పంట పొలాలను, నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు.. అన్నదాతలతో ముచ్చటించి,వారి బాధలను అడిగి తెలుసుకున్నారు… మూసి ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్న ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ..ఇక నాగార్జునసాగర్ ఆయకట్టు లో కూడా ఎగువ ఉన్న నారాయణపురం, ఆల్మట్టి డ్యామ్ లనుండి నీటిని తెప్పించి రైతులకి అందించాలని డిమాండ్ చేశారు ..తెలంగాణ లో ఏ గ్రామానికి వెళ్ళిన ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని అన్నారు.. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే ,అధికారులు కూడా రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దందాలు తప్ప ,రైతుల గోడు పట్టట్లేదని అన్నారు ..జిల్లా మంత్రులు కోమటిరెడ్డి,.ఉత్తమ్ లు ఉత్తరకుమారులని, ప్రగల్భాలు పలకడం తప్పా దేనికి పనికిరారని అన్నారు… వారుకి ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప రైతుల సంక్షేమం పట్టలేదని అన్నారు… కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పూరిత వైఖరితో రైతులు మరింత అగాధంలోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు ..ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరువుపై సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు ..లేదంటే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందని అన్నారు… ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, ,నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, brs నాయకులు, చెరుకు సుధాకర్, పంకజ్ యాదవ్.. దీప వెంకట్ రెడ్డి యాదయ్య గౌడ్, నాగరాజు, దేవేందర్, లింగుస్వామి, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page