అమ్మ సేవ సదనం వృద్ధాశ్రమంలో యువ నాయకులు అరేం. ప్రశాంత్ జన్మదిన వేడుకలు

Spread the love

Amma Seva Sadan Old age home are young leaders. Prashanth’s birthday celebrations

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (సాక్షిత న్యూస్)
అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండల కేంద్రం లో
అమ్మ సేవ సదనం వృద్ధాశ్రమంలో యువ నాయకులు,సామాజిక సేవ కార్యకర్త అరేం. ప్రశాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొని 50 కేజీల బియ్యం అరటి పండ్లు అందజేసి వారితో కాసేపు సరదాగా గడిపి ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు భరోసా కల్పించాలని, మీకు ఉన్నంతలో ప్రతి ఒక్కరు సేవ సహాయ కార్యక్రమాలు చేయగలరని కోరుతూ అలానే గతంలో ఈ వృధాశ్రమo కు స్థలం కేటాయించాలని కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది కావున నూతన నిర్మాణం జరగాలని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు స్థలం కేటాయించడం జరిగింది కావున స్థానిక ఎమ్మెల్యే మెచ్చా.

నాగేశ్వరావు ,పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరావు చొరవ తీసుకొని అమ్మ సేవ సధనం కు నూతన నిర్మాణం ఏర్పాటు చేయాలని తేలియజేస్తు రాబోయే రోజుల్లో మరెన్నో మా వంతుగా ఈ అమ్మ సేవాసదన వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో అమ్మ సేవ సధన వృదాశ్రమ నిర్వాహకురాలు అనసూయ గారు, శిరోమణి గారు అశ్వారావుపేట నియోజకవర్గం బీఎస్పీ నాయకులు రాయల పోలయ్య గారు, షేక్ నాగు, దినేష్ అశ్వారావుపేట నియోజకవర్గ యువ నాయకులు వాడే. వీరస్వామి ,గారు కాక శివశంకర్ ప్రసాద్, గారు కోరెం. రమేష్, కుర్సం రవి ,గారు ఆశ్రమ వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page