ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా…

Spread the love

Always ahead in the development of temples…

ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటా…


సాక్షిత : కైసర్ నగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధికి రూ.2.50 లక్షల విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మ, నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని సందర్శించారు.

ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధిలో ఎల్లవేళలా ముందుంటానని అన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతుగా రూ.2.50 లక్షల విరాళం ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సాయి బాబా మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page