SAKSHITHA NEWS

[3:55 PM, 10/20/2023] Sakshitha News: బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సకల జనుల సంబురం…మ్యానిఫెస్టోతో ప్రతి ఇంటా పండుగ..మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ జేజేలు – ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..
[3:57 PM, 10/20/2023] Sakshitha News: *సాక్షిత : *ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల ప్రజా మ్యానిఫెస్టోను బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో గడప గడపకు తెలియజేయాలి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజక వర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మీడియా సమావేశం..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ గండి మైసమ్మ పరిధిలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల ప్రజా మ్యానిఫెస్టోను ఈ రోజు మేడ్చల్ జిల్లా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు..

సీయం కేసీఆర్ విడుదల చేసిన భారాస మ్యానిపెస్టో ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేసింది…
సబ్బండ వర్గాల సంక్షేమం, స్వావలంబనే లక్ష్యంగా మ్యానిఫెస్టో ఉండటం హర్షణీయం…
రాష్ట్రంలో 93లక్షల కుటుంబాలు లబ్ది పొందేలా 5లక్షల భీమా కల్పించడం గొప్ప నిర్ణయం…
ఆసరా పించన్ లను దశల వారీగా 5000 వరకు పెంచడం సంతోషం…
రైతు బందును 16 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం రైతాంగానికి శుభ వార్త…
నియోజక వర్గంలో 6500 ఇల్లు నిర్మాణం చేసి ప్రజలకు అంద జెస్తాము..
ఆరోగ్యశ్రీ ని 15 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయం…
గృహ లక్ష్మి ద్వారా అర్హులైన ప్రతీఓక్కరికి 3లక్షల రూపాయలు ఇస్తామని ప్రస్తావించడం సంతోషం….
అసైండ్ భూములను అమ్మకానికి రైతుకు హక్కులు కల్పించేందకు ముందుకు రావడం సంతోషం….
ఈ పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలి..ఈ రెండు దఫాల్లో వేల కోట్ల రూపాయలు నియోజక అభివృద్ధి కోసం ఖర్చు చేశాము…
విజన్ ఉన్న నాయకుడు సీయం గా ఉండటం వల్లే నియోజక వర్గాన్ని ఇంతలా అభివృద్ధి పరిచేందుకు అవకాశం దొరికింది….

గతంలో 41 వేల మెజారిటీ ఇచ్చిన మీరు ఈసారి అంతకన్నా భారీ స్థాయిలో మెజార్టీ ఇచ్చి వివేకానంద ని ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అద్భుతంగా అభివృద్ధి పరుస్తాను….

నియోజకవర్గానికి సంబంధించిన ప్రగతి నివేదన మరియు మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తా….

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము చేసిన అభివృద్ధి మరియు చేయబోయే అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పధకాలను ప్రణాళిక రూపంలో విడుదలచేసిన మ్యానిఫెస్టోను నాయకులు, కార్యకర్తలు గడపగడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని వివరించి – కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు..

Whatsapp Image 2023 10 20 At 3.46.04 Pm

SAKSHITHA NEWS