SAKSHITHA NEWS

ప్రధాన పార్టీలన్ని
అవినీతిమయమే

  • తిరుపతిలో మీడియాతో కేఏ.పాల్ విమర్శలు సాక్షిత, తిరుపతి బ్యూరో: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటి వరకు పాలన సాగించిన టిడిపి, కాంగ్రెస్ లతో సహా వైసీపీ, బీజేపీ ప్రముఖ పార్టీలు అన్ని మొదటి నుంచి అవినీతి , దోపిడి పాలనకు కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. వీటిపై విరక్తి చెందిన రాష్ట్ర ప్రజలు తమ ప్రజాశాంతి పార్టీ కి ఈసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అంతేగాక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రజాశాంతి పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా మహిళకు అవకాశం ఇస్తానని పేర్కొన్నారు. దీంతో ఏపీ , తెలంగాణ ప్రజలు నిజమైన శాంతియుత పాలనతో, ఆదర్శంగా ప్రపంచం మేచ్చేలా పాలన చూస్తారని తెలిపారు. గత చంద్రబాబు టీడీపీ పాలన , నేడు వైసిపి జగన్ పాలన ఈ రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని ఎద్దేవా చేశారు. వైయస్సార్ సీపీ, టిడిపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ వారసత్వ పార్టీలేనని దుయ్యబట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాల ఓటర్లు అంతా ఒక్క ఓటు చీలకుండా, దోపిడీ పార్టీలకు వెయ్యకుండా ప్రజాశాంతి పార్టీ కి వేయాలని విజ్ఞప్తి చేశారు.

SAKSHITHA NEWS