చట్టం ముందల అందరూ సమానులే – ఎమ్మెల్యే సింహాద్రి

Spread the love

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే..
-సింహాద్రి రమేష్ బాబు

విద్యార్థులు, ఉద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డిన వ్యక్తి చంద్రబాబు – రైతు విభాగం జోనల్ ఇంచార్జ్ కడవకొల్లు నరసింహారావు

కృష్ణాజిల్లా:

అవనిగడ్డ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి బాబు మాట్లాడుతూ టిడిపి నాయకులు,చంద్రబాబు అరెస్టుపై ముసలకన్నీరు కారుస్తూ లేనిపోని రాధాంతాలు చేస్తున్నారు..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నుఅరెస్ట్ చేయించారని లేనిపోని ఆరోపణలు చేయటం మంచి పద్ధతి కాదు..

ఈ స్కాం గురించి 2018 సంవత్సరంలోనే కేంద్ర సంస్థ ప్రశ్నించింది ..జిఓ కి విరుద్ధంగా ప్రభుత్వం సోమ్మ దోసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు..క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసి చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి కోట్లాది రూపాయలు సొమ్మును సోహాశచేసిన చంద్రబాబునాయుడుని ఎవరు కాపాడలేరు..జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకు తెలియకుండా బాబు బృందం దొంగల ముఠాగా ఏర్పడి లోపాయికారి ఒప్పందంతో షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్ల ప్రజాధనం లూటీ చేశారు అని అన్నారు…

ఈ సందర్భంగా కడవకొల్లు నరసింహారావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక అవినీతి చక్రవర్తి ఆయన ముందు నుంచే సొంత మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న తత్వం ఆయనది, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 371 కోట్లు అవినీతి చేసారు .. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పట్ల చిత్తశుద్ధితో పోలవరం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రజాధనాన్ని ఆదా చేసే కార్యక్రమం చేపట్టారు,మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ప్రజాధరాలను దోచుకునే పద్ధతులు ఎన్నో అవలంబించారు అని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతీదేవి,జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ భాష,అవనిగడ్డ మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ నలకుర్తి పృధ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page