ఆలేరు ఎమ్మెల్యే బరిలో రాపోలు వీర మోహన్ ?

Spread the love

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం నుంచి మన పద్మశాలి ముద్దుబిడ్డ అయినా రాపోలు వీర మోహన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.

చేనేత రంగంలోని పలు సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేశారు. గతంలో భువనగిరి యాదాద్రి జిల్లాలో పలు కార్యక్రమాలు చేసి ప్రజలను పొందినారు. ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమాతో ముందుకెళుతున్నారు. ఆలేరు నియోజకవర్గంలో దాదాపు 38వేల ఓట్లు మన పద్మశాలీల కలిగి ఉండడం ఆయన విజయానికి తోడ్పాటు అందిస్తుందని ఆశాభావే వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం మన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి కుల బంధువు లపై ఉంది.

Related Posts

You cannot copy content of this page