ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టిడిపి సీనియర్ నేత..

Spread the love

పార్టీలో నెంబర్ టూ.. పార్టీ అధినేతకు సమకాలీకుడు.. పార్టీ పట్ల అత్యంత విధేయుడు. ప్రక్కచూపులు చూడని నేత.. అంతటి ప్రొఫైల్ ఉన్న ఆ నేత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన ఎవరంటే అశోక్ గజపతిరాజు.

ఈ నేపథ్యంలోనే ఆయన తన పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను అనారోగ్య కారణాలతోనే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. భవిష్యత్తులో ఒక సీనియర్‎గా పార్టీ ఎప్పుడైనా, ఏమైనా సలహాలు అడిగితే మాత్రం తప్పకుండా ఇస్తానని అన్నారు.

అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతున్నానన్న అశోక్ ప్రకటనతో ఆయన అభిమానుల్లో మాత్రం ఒకింత నిరాశ నెలకొంది.

Related Posts

You cannot copy content of this page