SAKSHITHA NEWS

కృష్ణాజిల్లా గుడివాడలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది, లక్ష్మీ రామ సెంటర్లో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న కారు కొంత దూరం ఈడ్చు కేళ్లడంతో,ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఇరువురిని హాస్పిటల్ కు తరలించగా, చికిత్సలు అందించిన వైద్యులు ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులు మండవల్లి మండలం చావలిపాడుకు చెందిన అక్షయ్, నవీన్ గా పోలీసులు గుర్తించారు. చావలపాడు నుండి విజయవాడ అమ్మవారి గుడికి పాదయాత్రగా వెళుతున్న బృందానికి అక్షయ్, నవీన్ అల్పాహారం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సహచరులు చెప్పారు.


SAKSHITHA NEWS