ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం

Spread the love

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ను జిల్లా ఎస్పీ శ్రీమతి కె.సృజన జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సంధర్బంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 9 మంది బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా ఎస్పి బాధితుల సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఫిర్యాదులలో బెదిరింపులకు సంభందించి కొన్ని పిర్యాదులు వచ్చాయి. అదేవిధంగా భూ వివాదాలు , కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక మోసాలు ,భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించారు. ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత ఎస్సై లను, సీ.ఐ లను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page