హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట చెరువు వద్ద పార్కు లో నూతనంగా ఏర్పాటు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట చెరువు వద్ద పార్కు లో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు (వీధి దీపాలను) స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ కిందికుంట చెరువు వద్ద పార్కు లో వీధి దీపాలను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, వీధి దీపాల ఏర్పాటు ద్వారా పార్కులో వాకింగ్ చేసే వారికీ, రోడ్డు పై వెళ్లే వాహనాలకు చీకటి సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగేలా విధి దీపాలు దోహదపడతాయి అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. మరియు కిందికుంట పార్క్ కీ కొత్త శోభ వచ్చినది అని, విధి దీపాల వెలుగులు, ప్రకాశవంతమైన కాంతులు విరాజిల్లుతూ పార్క్ కొత్త శోభను సంతరించుకుంది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు. వీధి దీపాలు ఏర్పాటు చేయడం వలన రాత్రి సమయంలో వాహన దారులకు, పాదచారులకు ఇబ్బందులు కలగకుండా తోడ్పడుతాయి అని అదేవిధంగా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ మరియు కాలనీ వాసులు సుబ్బా రాయుడు, సాయి బాబు, రాము, రాజేశ్వర్ రావు, సీతారాం, రాజు సాగర్, సత్తార్, శ్రీనివాస్, తమ్మ రావు, సుదర్శన్, కేవీ రావు, శివ, రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page