భౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో చేపడుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్

Spread the love

భౌరంపేట్ లో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో చేపడుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్ గ్రామంలో ముదిరాజ్ సంఘం కొరకు రూ.30.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

పేద ప్రజల శుభకార్యాలకు ఉపయోగపడేలా చేపడుతున్న కమిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేయడం పట్ల సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు ఆగం రాజు ముదిరాజ్, ఆగం పాండు ముదిరాజ్, సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మురళి యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, ఆకుల యాదయ్య, స్వామి ముదిరాజ్, పెంటయ్య ముదిరాజ్, గుమ్మడి మధుసుధన్ రాజు ముదిరాజ్, సంఘం ప్రెసిడెంట్ శంభిపూర్ బాగయ్య ముదిరాజ్, మత్స్య సహాకర సంఘం ప్రెసిడెంట్ మన్నె బాల్ రాజ్ ముదిరాజ్, ముదిరాజ్ సంఘం ట్రెజరర్ మన్నె శేఖర్ ముదిరాజ్, రాయిలపురం కృష్ణ ముదిరాజ్, చింత మల్లేష్ ముదిరాజ్ మరియు సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page