సచివాలయ అధికారులకు సమావేశం నిర్వహించారు

Spread the love

ప్రకాశం జిల్లా….!!!!!
పెద్ద దోర్నాల్లోని స్థానిక ఎంఆర్సి భవనంలో ఎంపీడీవో నాసర్ రెడ్డి అధ్యక్షతన మండల పరిధిలోని అధికారులకు, రామ సచివాలయ అధికారులకు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీడీవోనాసర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర ప్రభుత్వం అందించాలని లక్ష్యంతో 17 రకాల లక్ష్యాలను ఇవ్వటం జరిగిందని తెలియజేశారు, ప్రతి ఒక్కరికి సమాజంలో భౌగోళిక పరిస్థితులు కనీస అవసరాలు తీర్చాలని లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలను జారీ చేసిందని తెలియజేశారు, మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్ మాట్లాడుతూ ముఖ్యంగా బడి ఈడు పిల్లలందరూ 100% బడికి వెళ్లే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు, అదేవిధంగా డ్రాప్ అవుట్స్ను గుర్తించి పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం, పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు అన్ని రకాల వసతులు తయారు చేయటం, ముఖ్యంగా నాడు నేడు పాఠశాలలకు నాణ్యమైన వసతులు కలగజేయటం అన్ని రకాలైన వసతులు ముఖ్యంగా విద్యార్థులకు మరుగుదొడ్లు ఏర్పాటు అదేవిధంగా జగనన్న విద్య కానుక లో స్కూలు విద్యార్థినీ విద్యార్థులకు ఏడు రకాల వస్తువులు ఇచ్చి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు, సుస్థిర సమాజం ఏర్పరాలంటే ప్రతి ఒక్క అధికారి తమ వంతుగా కృషిచేసి సమాజంలోని ప్రజలను మమేకం చేస్తూ భౌగోళిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల గురించి చక్కగా వివరించి వారికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కెపి ఎపిఎం పోలయ్య, ఎంఈఓ మస్తాన్ నాయక్, మండల వ్యవసాయ శాఖ అధికారి జవహర్లాల్ నాయక్, మండల పరిధిలోని గ్రామ సచివాలయ పంచాయితీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, గ్రామ సచివాలయాల వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page