మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ తో సమావేశం

Spread the love

*సాక్షిత : * 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నూతన కలెక్టరేట్ లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ తో ఏర్పాటు చేసిన సమావేశం లో పాల్గొన్నారు.


ఈ సమావేశం లో అల్లాపూర్ డివిజన్ సంబందించిన అంశాల మీద కార్పొరేటర్ మాట్లాడుతూ జివో నం 58 క్రింద 355 కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని అడగటం జరిగింది మరియు జివో నం 59 క్రింద ఎవరైతే 10 శాతం అమౌంట్ కట్టుకున్న వారికి క్రమబద్దీకరణ చేయాలనీ చెప్పటం జరిగింది,

అలాగే అల్లాపూర్ లో కొత్తగా 20 అంగన్ వాడి సెంటర్ లు ఏర్పాటు చేయాలనీ,అల్లాపూర్ డివిజన్ లో నాలుగు స్కూల్స్ ఉన్నాయని అందులో మూడు తెలుగు మీడియం ఒకటి ఉర్దూ మీడియం అని,స్కూల్ లో స్టూడెంట్స్ సంఖ్య పెరగటం వల్ల సర్వే నం 18 లో ఉర్దూ మీడియం ,తెలుగు మీడియం హై స్కూల్ శాంక్షన్ చేయాలనీ ,కొన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ ,వంట గది,మంచి నీరు, వసతులు సరిగ్గా లేకపోవటం వల్ల స్టూడెంట్స్ కి ఇబ్బంది కలుగుతుంది అని ఆ సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలి అని చెప్పి వాటికీ కోసం కలెక్టర్ కి వినతి పత్రం అందజేయటం జరిగింది. గతం లో సర్వే నం 18 ల్యాండ్ ని జి.హెచ్.ఎం.సి వారికీ హ్యాండోవర్ చేసేలా చర్యలు తీసుకోవాలని అడిగిన దానికి కలెక్టర్ జి.హెచ్.ఎం.సి కి హ్యాండోవర్ చేస్తున్నట్టు లెటర్ ఇవ్వటం జరిగింది అన్నారు .

Related Posts

You cannot copy content of this page