SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మండలం వెలిమినేడు లో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు అంతటి నరసింహ జన్మదిన వేడుకలని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంతటి పారిజాత నరసింహ గౌడ్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చౌటుప్పల్ లో అమ్మానాన్న ఆశ్రమంలో పండ్ల పంపిణీ చేసి 5వేల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు, మిత్రులకి, శ్రేయోభిలాషులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ మండల నాయకులు అంశాల శ్రవణ్ కుమార్ గోలి నరేష్, నాయకులు ఉమ్మెత్తలా శివకుమార్ బైకాని స్వామి పాల్గొన్నారు.


SAKSHITHA NEWS