ఆస్బె స్టాస్ కాలనీ లో కల్వరి హాస్పిటల్ వారి ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం

Spread the love

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్ కాలనీ లో కల్వరి హాస్పిటల్ వారి ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలతో కూడిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం చాలా అభినదనియం అని, ఇక్కడి పరిసర ప్రాంత పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని ,ఈ శిబిరం ఏర్పాటు చేసిన కల్వరి ఆసుపత్రి యాజమాన్యం కు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు ఇందులో భాగంగా.జనరల్ మెడిసిన్ సంబంధించిన వైద్యులు ,స్త్రీల వైద్యులు , చిన్న పిల్లల వైద్యులు,ఎముకలకు సంబంధించిన వైద్యులు, చర్మ వైద్యులు, నేత్ర వైద్యులు పాల్గొని ఉచిత వైద్య పరిక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందించడం అభినందనీయం అని, ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు .ఈ సందర్భంగా డాక్టర్లను ప్రత్యేకంగా అభినదించడం జరిగినది .

ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో 18 రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్,గైనకలజీ,ఆర్థో,ECG,ENT, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్సరే అర్హులైన వారికి ఉచిత కళ్ళజోడులు, ఉచిత మందులు పంపిణీ వంటి మొదలగు సేవలు ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగినది అని ,పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం చాలా అభినందనియమని ఆరోగ్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో సామాజిక దృక్పథంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం చాల గొప్ప విషయం అని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు.

పేద ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొనడం జరిగినది .మానవతా దృక్పతం తో ఉచితంగా మందులు పంపిణి చేసి పేదల వద్దకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యం అని ,ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యము పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు. ఈ ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినదించడం జరిగినది. ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని అంతే కాకుండా సీజనల్‌ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు.

ఈ కార్యక్రమంలోబీఆర్ఎస్ పార్టీ నాయకులు నాగేశ్వరరావు, అబుల్, కృష్ణ ,ఖయ్యుమ్,రఫిక్, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 28 At 5.29.50 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page