SAKSHITHA NEWS

తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించింది జర్నలిస్టులే

  • ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్

మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలని కలెక్టర్ ఫిష్ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు,రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి వినతి పత్రం అందజేశారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వివిధ దిన పత్రికలు, టివి, యూట్యూబ్ చానల్స్ లో జర్నలిస్టులుగా పని చేస్తున్న వారికి ఇండ్ల పట్టాలను అందిస్తామని గతంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారని కాని ఇప్పటి వరకు అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో జిల్లా, మండల, మున్సిపాలిటీల స్థాయిలో పని చేయుచున్న జర్నలిస్టుల బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారిని కాపాడించిన బాధ్యత మనపై ఉందన్నారు.ఉద్యమం సమయంలో కీలక పాత్ర పోషించారని జర్నలిస్టులే అని ప్రభుత్వం వెంటనే స్పందించి ఇండ్ల పట్టాలు అందజేయాలని మీడియా ద్వారా డిమాండ్ చేశారు


SAKSHITHA NEWS