SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్(125) పరిధిలోని శ్రీరాంనగర్ బి నూతన కార్యవర్గం శ్రీ నవశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి. విజయ్ రామ్ రెడ్డి , వార్డ్ మెంబర్ అజయ్ ప్రసాద్ గుప్తా, నూతన అధ్యక్షులు మజీద్, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరీష్, కార్యవర్గ సభ్యులు రఫీ యుద్దీన్, పాండు రెడ్డి, వెంకటరమణ, నజీర్, చిన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS