SAKSHITHA NEWS

సాక్షిత : కురుస్తున్నటువంటి భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో భిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

గాజులరామారండివిజన్ దేవేందర్ నగర్ మరియు బతుకమ్మ బండ నుంచి దాదాపు100 కుటుంబాలు భిఆర్ఎస్ కార్యకర్తలు సొంటి రెడ్డి పున్నారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది.ఈ కార్యక్రమంలో సొంటిరెడ్డి పున్నారెడ్డి సభాముఖంగా మాట్లాడుతూ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ఉత్సాహం చూస్తుంటే రాబోయే రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు లాల్ మొహమ్మద్, బేకరీ గడ్డ ప్రెసిడెంట్ గఫర్, కాంగ్రెస్ యువ నాయకులు దండే రాజు, రాజ్ కుమార్ విశాల్, తదితరులు పాల్గొనడం జరిగినది.


SAKSHITHA NEWS