సాక్షితతిరుపతి* : ఓటర్ల సర్వేకి వెల్లేటప్పుడు బూత్ లెవల్ ఆఫిసర్స్(బి.ఎల్.ఓ) తమ వెంట గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీల తరుపున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్స్(బి.ఎల్.ఏ) లకు సమాచారం ఇచ్చి తమతో తీసుకెల్ల వచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నియోజకవర్గంకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం తిరుపతి నియోజకవర్గం ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టి ప్రతినిధులు మాట్లాడుతూ తమ పార్టీ తరుపున పంపించిన బి.ఎల్.ఏలకు కొన్ని ప్రాంతాల్లో సర్వేకు వెల్లేటప్పుడు, సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలపడంతో స్పందించిన కమిషనర్ బి.ఎల్.ఏలకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ చేస్తూ తిరుపతి నియోజకవర్గంలో ఇంటింటికి జరిగే ఓటర్ల సర్వేకు వెల్లెటప్పుడు, ఇప్పటికే వై.సి.పి, టిడిపిల తరుపున రెకమెండ్ చేసిన బి.ఎల్.ఏలకు సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటింటికి వెల్లి ఆ ఇంట్లో వారి ఓటర్ల వివరాలను, మన దగ్గరున్న ఓటర్ల లిస్ట్ తో సరి చూసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన వారు ఆ ఇంట్లో వుంటె, వారిని ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. అదే ఇంట్లో ఓటరుగా వుండి మృతి చెంది వుంటె, ఆ ఇంట్లోని వారి కుటుంబికుల నుండి ఫామ్ ధరఖాస్తూ చేయించి, మృతి చెందిన ఓటరుని తొలగించాలన్నారు. ఓటర్ల నమోదులో గాని, తీసి వేయడంలో గాని చట్టబద్దత పాటించాలని, ఏవైన తప్పులు జరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలకు గురి కావల్సి వస్తుందని కమిషనర్ హరిత ఐఏఎస్ హెచ్చరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ మీరు రెకమెండ్ చేసిన బి.ఎల్.ఏలకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన పోటో ఐ.డిని క్రియేట్ చేసి పంపించాలన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, తిరుపతి నియోజకవర్గం ఏ.ఇ.ఆర్వోలు అర్భన్ ఎమ్మార్వో వెంకటరమణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డిప్యూటీ తాసీల్ధార్ జీవన్ పాల్గొన్నారు*
Related Posts
Spread the love అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిందెవరు? ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక.. మరికొందరిపై కేసులు! ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు…
Spread the love నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ……
Spread the love కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీషజాతరలో మొక్కులు తీర్చుకున్న మేయర్ దంపతులు* సాక్షిత : తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఉదయం మేయర్ ఇంటి…
Spread the love హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్.. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్. AP Election…
Spread the love ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది…
Spread the love గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం
Spread the love విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు…
Spread the love రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూరకి అభినందనలు! బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేసిన గోపీచంద్ రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత…
Spread the love సీఎం జగన్పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు.…
Spread the love జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్…