SAKSHITHA NEWS

జగనన్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

ఉదయం గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం 11వ వార్డ్ 27వ సచివాలయం పరిధిలో ఉన్న ఖడక్పురా వీధుల్లో నిర్వహించారు

పేదల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. స్థానిక 11వ వార్డులో మున్సిపల్, సచివాలయ సిబ్బంది, స్థానిక వార్డ్ నాయకులతో కలిసి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఖడక్ పురా, ఫాతే మస్జీద్,మోమిన్ వీధుల్లో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధితోనే పేదల బతుకులు మారుతాయని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి మేలు చేసేలా పథకాలు తీసుకొచ్చి పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ కార్పొరేటర్ ఫరాజ్ ఖాన్ , పార్టీ ముఖ్యనాయకులు నూరుల్లా ఖాద్రి సాహెబ్ ,ఫైసల్ ఖాన్ గారు, జుబైర్ ,దావూద్ ,షబ్బీర్ ,ఉదయ్ , కన్వీనర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS