భారీ వర్షం కారణంగా చిలకలగుడా సమీపంలో నాలా పై స్లాబ్ భాగం పాక్షికంగా ధ్వంసం

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ : భారీ వర్షం కారణంగా చిలకలగుడా సమీపంలో నాలా పై స్లాబ్ భాగం పాక్షికంగా ధ్వంసం కావడంతో అధికార యంత్రాంగం, బీ ఆర్ ఎస్ స్థానిక నాయకత్వం వెంటనే స్పందించింది. అజ్మీర్ పర్యటనలు ఉన్న డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు బీ ఆర్ ఎస్ యువ నేత తీగుళ్ళ కిశోర్ కుమార్, మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత, సమన్వయకర్త జలంధర్ రెడ్డి ల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొంది. జీ హెచ్ ఎం సి ఏ ఈ వేణు అధ్వర్యంలో డీ ఆర్ ఎఫ్, జీ హెచ్ ఎం సి బృందాలను వెంటనే రప్పించి నాలా లోని శకలాలను జే సి బీ సాయంతో తొలగించారు. దాంతో నాలా లోని నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు మార్గం సుగమమై స్థానికంగా ముంపు ముప్పు తప్పింది. రాత్రంతా తీగుళ్ళ కిశోర్ కుమార్, రాసురి సునీత ల ఆధ్వర్యంలోని బృందం ఈ ప్రదేశంలో శకలాలు తొలగించి, బ్యారి కేడ్లు ఏర్పాటు చేసే పనులను కొనసాగించారు

Related Posts

You cannot copy content of this page