సాక్షిత : డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో BJP నాయకులు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లో గల తన కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. దేశంలో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అని వివరించారు. స్వయం పాలనలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్ని మౌలిక సౌకర్యాలు, వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల ఇండ్లను, GHMC పరిధిలో లక్ష ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో పేదలకు నిర్మించిన ఇండ్ల కార్యక్రమంలో లబ్దిదారుడి వాటా, బ్యాంక్ రుణం, కొంత ప్రభుత్వ సహాయం ఉండేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లబ్దిదారుడిపై ఒక్క పైసా భారం లేకుండా ఉచితంగా నిర్మించి ఇస్తుందని వివరించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని IDH కాలనీలోనే మొట్టమొదటగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగిందని చెప్పారు. ఇప్పటికే నగరంలోని సనత్ నగర్, కార్వాన్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ తదితర నియోజకవర్గాలలో ఇండ్లను నిర్మించి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కొల్లూరు లో 6,700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీని ఇటీవలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ ఇండ్లను కూడా అర్హులైన లబ్దిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి ప్రకటించారని చెప్పారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర BJP అద్యక్షుడిగా బాద్యతాయుతమైన పదవులలో ఉన్న కిషన్ రెడ్డి కి అధికారికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి పరిశీలించే అవకాశం ఉన్నప్పటికీ అలా కాదని రోడ్డుపై బైఠాయించాల్సిన అవసరం ఏముందని, ఏం ఆశించి ఎందుకోసం ఈ రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేస్తామని ప్రకటించిన తర్వాత కూడా ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం మీరు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలకు మేలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎందుకు నిధులు తేలేకపోతున్నారని ప్రశ్నించారు. పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. సొంత స్థలం ఉంది ఇల్లు నిర్మించుకోలేకపోతున్న పేదలకు అర్హులైన ఒకొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించే విధంగా గృహలక్ష్మి అనే నూతన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించున్నట్లు వివరించారు. ఒక్కో నియోజకవర్గ పరిధిలో 3 వేల మంది అర్హులకు ఈ ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే రోడ్డుపై అర్ధం లేని ఆందోళన చేపట్టారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రశంసించిన విషయం వాస్తవం కాదా ? అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇక నైనా తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు
Related Posts
Spread the love హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం. అలాగే…
Spread the love మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్వనపర్తి జిల్లాకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ చెన్నయ్య (తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్నగర్ వాసి సంపత్ యాదవ్…
Spread the love హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. ఉద యం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు…
Spread the love జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి.…
Spread the love కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.
Spread the love ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం…
Spread the love ప్రశ్నించే గొంతుక.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి. తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసేవారు తన వారైనా ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్…
Spread the love ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అత్యధిక ఓటర్లు ఉన్న దేశం కూడా మనదే మన దేశానికి స్వతంత్రం అనంతరం 1952లో మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అక్షరాస్యత రేటు 20%…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు….. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందన ఎమ్మెల్యే గాంధీ* పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు…
Spread the love సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం…