SAKSHITHA NEWS

4

గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


*సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 126 జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు నర్సింగ్ మరియు వారి బృందం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో ఎమ్మెల్యే నివాసం వద్ద కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సంక్షేమ సంఘం సభ్యులకు ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 126 డివిజన్ బీఅర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు,సంక్షేమ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS