SAKSHITHA NEWS

డిపిఓ జయచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..

NTR జిల్లా / నందిగామ టౌన్ :

నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని, శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని జిల్లా పంచాయతీ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తిరువీధుల సాయినాథ్ జయచంద్ర (గాంధీ) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు ..

ఈ సందర్భంగా డిపిఓ జయచంద్ర కు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వచ్చేలా పని చేయాలని సూచించారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .


SAKSHITHA NEWS