SAKSHITHA NEWS

పదవితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి – యస్.పి అపూర్వ రావు

— జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న ఎ ఎస్ ఐ లకు ఎస్సై లుగా పదోన్నతి

నల్లగొండ సాక్షిత

జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో పనిచేస్తున్న ఏడుగురు ఎ ఎస్ ఐ లకు ఎస్సై లుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో యస్.పి అపూర్వ రావు ని నమర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేయడం జరిగింది. పదోన్నతి పొందిన ఎస్సై లకు యస్.పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా యస్.పి మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి ప్రజల యొక్క మన్ననలు పొందాలని అన్నారు. బాధితుల న్యాయం జరిగే విదంగా పనిచేయాలని అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని అన్నారు.అనంతరం ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఎండ వేడిమికి తట్టుకునేందుకు (కంటి అద్దాలు) సన్ గ్లాస్ లు, కూలింగ్ హెల్మెట్ లు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ ఆర్. ఐ స్పర్జన్ రాజ్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్, సెక్రటరీ సోమయ్య మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS