SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా 41వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
జీడిమెట్ల డివిజన్ జైరాం నగర్, రుక్మిణీ ఎస్టేట్స్, మహా నగర్ కాలనీల్లో పాదయాత్ర…
అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 41వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా జైరాంనగర్, రుక్మిణీ ఎస్టేట్స్, మహానగర్ కాలనీల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగిలి ఉన్న సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ, పార్క్ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ వంటి పనులు తెలుసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా వేగంగా వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. గతంలో అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న తమ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతులు కల్పించినందుకు ప్రజలు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, బస్తీ, కాలనీ వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS