కృష్ణాజిల్లా గుడివాడలో దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది, లక్ష్మీ రామ సెంటర్లో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని డీ కొన్న కారు కొంత దూరం ఈడ్చు కేళ్లడంతో,ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. తీవ్రంగా గాయపడిన ఇరువురిని హాస్పిటల్ కు తరలించగా, చికిత్సలు అందించిన వైద్యులు ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులు మండవల్లి మండలం చావలిపాడుకు చెందిన అక్షయ్, నవీన్ గా పోలీసులు గుర్తించారు. చావలపాడు నుండి విజయవాడ అమ్మవారి గుడికి పాదయాత్రగా వెళుతున్న బృందానికి అక్షయ్, నవీన్ అల్పాహారం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సహచరులు చెప్పారు.
లక్ష్మి రామా సెంటర్లో రోడ్డు ప్రమాదం ఇరువురికి తీవ్ర గాయాలు….. పరిస్థితి విషమం
Related Posts
రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని
SAKSHITHA NEWS రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం కేంద్రం…
వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు
SAKSHITHA NEWS వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావుసాక్షిత : పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్…