ప్రజా గోస -బీజేపీ భరోసా అనే కార్యక్రమం

Spread the love

ప్రజా గోస -బీజేపీ భరోసా అనే కార్యక్రమం సందర్బంగా, తాండూర్ పట్టణము లో అధ్యక్షులు సుధర్షన్ గౌడ్ స్థానిక TSRTC బస్టాండ్ దగ్గర దీక్ష చేయడం జరిగింది.


వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణం బస్టాండ్ డా!!అంబేద్కర్ విగ్రహం సమీపమున బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్
ప్రజా గోస -బీజేపీ భరోసా

అని దీక్ష చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి, ఈ మధ్యానే తన ఇంటి పైన దాడి చేస్తే, తన ఇమేజ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల తో పాటు,ఢిల్లీ కేంద్ర బీజేపీ హోమ్ మంత్రి వరకు పెరిగి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి క్రిష్ణ గౌడ్ , జిల్లా బీజేపీ ప్రదాన కార్యదర్శి శ్రీ U రమేష్ . సీనియర్ నాయకులు మనోహర్ రావు, పూజారి పాండు,పటేల్ విజయ్,బాను ప్రసాద్, ప్రహ్లాద్ జాదవ్ బీజేపీ కౌన్సిలర్లు సావు శ్రీలత, బంటారాం లావణ్య బదరేశ్వర్, బీజేవైఎం నరేష్, శృతి, వీరమణి పాల్గోన్నారు,

ఈ సందర్బంగా బీజేపీ నాయకులు తాండూర్ ఒక MLA రోహిత్ రెడ్డి వర్గం, మరియు MLC పట్నం మహేందరెడ్డి వర్గం,మధ్యన ప్రజలు నష్ట పోతున్నరన్నారు.కేంద్రం ప్రతి వార్డుకు కోటి రూ!! లు ఇచ్చిన పనులు చేయలేయక పోతున్నారుఅధికారులు. ఎందుకు అంటే మున్సిపల్ ఆఫీసులో అధికారులు ఒక వర్గం వారు చేయమంటారు, మరొక వర్గం వారు వద్దు అంటున్నారు.ఎట్లా చేయాలిఅంటున్నారు. అందుకే ట్రాన్స్ఫర్లు పెట్టు కుంటున్నారు, కొత్తగా వచ్చేవారు తాండూర్ మున్సిపల్ అంటేనే రావటం లేదు,30 కోట్లు ఇంకా ఎప్పడు ఖర్చు చేస్తారు అని ఆరోపించారు.15 వ ఆర్ధిక సంఘం నిధులు ఎప్పటివరకు ఖర్చు చేస్తారు? అసలు మున్సిపల్ కమీషీనర్ ఎన్దుకు ఖాళీ ఉన్నది?అని ప్రశ్నిస్తే మాపై ఆరోపణలు చేస్తారా అంటున్నారు కదా, అధికారులను ఎందుకు తీసుక రాలేకపోతున్నరో ప్రజల ఆలోచన చేయాలన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page