ప్రగతి యాత్ర‘లో భాగంగా 32వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

Spread the love

ప్రగతి యాత్ర‘లో భాగంగా 32వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
చింతల్ డివిజన్ వల్లభాయి పటేల్ నగర్, సిక్కుల బస్తీల్లో ఎమ్మెల్యే పాదయాత్ర


*సాక్షిత : * కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 32వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా వల్లభాయి పటేల్ నగర్, సిక్కుల బస్తీల్లో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా వల్లభాయి పటేల్ నగర్ లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు పూర్తి చేయాలని స్థానికులు ఎమ్మెల్యే ని కోరగా అక్కడే ఉన్న అధికారులకు రూ.50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, కొంతమేర మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ పనులు, కరెంటు పోల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిక్కుల బస్తీలో మంజూరైన రూ.50 లక్షలతో సీసీ రోడ్ల పనులు వేగంగా చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈఈ శిరీష, ఏఈ సంపత్, డిజిఎం విష్ణు ప్రసాద్ మరియు సీనియర్ నాయకులు శేఖర్ రావు, బస్వరాజు, ప్రభాకర్ గుప్త, శమీమ్ బేగం, సుదర్శన్ రెడ్డి, ఐలయ్య యాదవ్, కుమార్ యాదవ్, మోహన్ రెడ్డి, సంపత్ యాదవ్, నాగిరెడ్డి, నర్సింహా శెట్టి, బాలమని, సునీత, మల్లేష్ యాదవ్, ఇర్ఫాన్, వెంకటేష్, సునీల్ కాలే, శివ ముదిరాజ్, బల్బీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page