SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర’లో భాగంగా 24వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

చింతల్ డివిజన్ లోని సాయినగర్, రంగానగర్, దుర్గయ్య నగర్ లలో పాదయాత్ర…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 24వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా సాయి నగర్, రంగా నగర్, దుర్గయ్య నగర్ లలో పాదయాత్ర చేస్తూ దాదాపు పూర్తి చేసిన సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా సాయి నగర్ లో భూగర్భడ్రైనేజీ పూర్తి అయిన లైన్ లలో సీసీ రోడ్డు వేయించాలని, రంగానగర్ లో వర్షపు నీరు రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని, పార్క్ లో షేడ్ మరియు ప్రహరి గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని, మిగిలి ఉన్న సీసీ రోడ్డు నిర్మాణం, దుర్గయ్య నగర్ లో కల్వర్టు నిర్మాణానికి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు వంటి పనులను స్థానికులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. ఆయా పనులన్నీ త్వరలోనే పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే గారు ప్రజలకు హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకున్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరూ తప్పక ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు కర్నెకంటి మల్లేష్, బండారు వరప్రసాద్, మురళి, శ్రీశైలం యాదవ్, గొరిగే మధు, వార్డు మెంబర్ మెహెరున్నిస బేగం, సామ్రాట్, సాయినగర్ కాలనీ ప్రెసిడెంట్ పండరి, చిరంజీవి, బాలాజీ, శ్రీనివాస్ గౌడ్, శశి నాయర్, అంజయ్య, కృష్ణ, భాస్కర్ రెడ్డి, నరేష్, రంగానగర్ కాలనీ వాసులు లక్ష్మణ్ రావు, నర్సయ్య, రామ్ ప్రసాద్, సతీష్, బద్రి, రామ కృష్ణ, సత్యనారాయణ, ఆనంద్, శాంత, సరోజ, మహేష్, సీనయ్య, ఎల్లప్ప, లక్ష్మీ నర్సయ్య, సురేందర్, అనంత్ రావు, సుబ్బారావు, దుర్గయ్య నగర్ బస్తి వాసులు సురేష్, రాజు, ఎస్కే మీరా, పున్నారెడ్డి, జాన్, మూర్తి, ఇంద్ర, రాధ, శ్రీకాంత్, సుధాకర్, వెంకన్న, ప్రభాకర్, శ్రీను, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS