పెరటి కోళ్ల పంపిణి కి తెలంగాణ సర్కార్ శ్రీకారం పుట్ట మధు

Spread the love

పెరటి కోళ్ల పంపిణి కి తెలంగాణ సర్కార్ శ్రీకారం పుట్ట మధు

మహిళల ఆర్థిక బలోపేతం దిశగా సర్కారు ఆలోచన

సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనలతో మహిళలకు ప్రయోజనం

మహిళల ఆర్థిక బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

మంథని మండల పరిషత్‌ కార్యాలయంలో జిల్లా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పెరటి కోళ్ల ను పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక మార్పులు జరిగాయని, తెలంగాణ రాక ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితులను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుందని నమ్మకంతో వారిని ఆర్థికస్వావలంభన దిశగా అడుగులు వేసేలా ప్రోత్సహాం అందిస్తోందన్నారు. ఇందులో బాగంగా పెరటి కోళ్ల పంపణీనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.గతంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక మందికి పెరటి కోళ్లను అందించి ఆర్థిక చేయూతనందించామన్నారు. పెరటి కోళ్లకు, వాటి గుడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. మహిళలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి ఆలోచన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు…

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page