SAKSHITHA NEWS

చింతకాని మండలంలో పొంగులేటి పర్యటన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చింతకాని మండలంలో మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నర్సింహాపురం, చింతకాని, పాతర్లపాడు గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలలో జరిగిన వివాహాది శుభకార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టువస్త్రాలను కానుకగా అందించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట సొసైటీ చైర్మన్ కొండపల్లి శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ నారపోగు వెంకటేశ్వర్లు, బాబు రెడ్డి, కిలారు మనోహర్, సారిక సైదులు, గోవిందరావు, మందడపు శ్రీనివాస రావు, గోగుల శ్రీనివాస రావు, ఎస్.కె రహ్మతుల్లా తదితరులు ఉన్నారు.

బోనకల్ మండలంలో పర్యటించిన పొంగులేటి

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి బోనకల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా బోనకల్ మండలంలోని తూటికుంట్ల, లక్ష్మీపురం, గోవిందాపురం, ఆళ్ళపాడు, మోటమర్రి గ్రామాలను సందర్శించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఆళ్ళపాడు గ్రామంలో నీళ్ళు లేక ఎండిపోయిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డాక్టర్ కోటా రాంబాబు, ఉమ్మినేని కృష్ణ, మందడపు తిరుమలరావు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS