SAKSHITHA NEWS

సాక్షిత : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ 44వ జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొనడం జరిగింది.

ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, దూలపల్లి పీఏసీఎస్ చైర్మన్ గరిశ నరేందర్ రాజు, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, కొంపల్లి బీఆర్ఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సన్న కవితశ్రీశైలం యాదవ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రావుల శేషగిరి, నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS