Leaders of the Telugu Desam Party who cannot tolerate good
మంచిని సహించలేకపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు
సాక్షిత : రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను తెలుగుదేశం పార్టీ నేతలు సహించలేకపోతున్నారని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
మోపిదేవి వన్ గ్రామ సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం నాటితో ముగిసింది.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మోపిదేవి వార్పు, అంబేద్కర్ నగర్ కాలనీలో రమేష్ బాబు ఇంటింటికి తిరుగుతూ ఆ కుటుంబం పొందిన లబ్ధిని వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పలువురు కాలనీవాసులు డ్రైనేజీ రోడ్ల సమస్యలను రమేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లారు.
మోపిదేవి మండల వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ మత్తి వెంకట సత్యనారాయణ, సర్పంచ్ నందిగం మేరీ రాణి, ఎంపీటీసీ సభ్యులు కారుమూరి శివ నాగరాజు, కార్యదర్శి కమిలి త్రిపుర సుందరిల ఆధ్వర్యంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ కామిశెట్టి వెంకట సురేష్ బాబు, ప్రముఖులు నందిగం అభిషేకరావు ల పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
![మంచిని సహించలేకపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు 2 leaders](https://sakshithanews.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-25-at-6.34.55-PM-1024x528.jpeg)