జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలకు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్

Spread the love

Municipal Chairperson attended the food donation programs in the district center

జిల్లా కేంద్రంలో అన్నదాన కార్యక్రమాలకు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్


సాక్షిత : పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దాసరి మనోహర్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని కారు అసోసియేషన్ మరియు జెండా కూడలి యందు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో పలు కూడళ్ళు సుందరంగా తీర్చిదిద్ది, ఎనలేని రోడ్లను ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి దాసరి మనోహర్ రెడ్డి ని తెలియజేశారు, అంతే కాకుండా నిత్యం పెద్దపల్లి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తి మన ఎమ్మెల్యే ని, ఆయన మరియు ఆయన కుటుంబం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో అష్ట ఐశ్వర్యాలతో, ఆయు ఆరోగ్యాలతో, సిరిసంపదలతో తులతూగాలని రానున్న రోజుల్లో మరొకసారి విజయం సాధించి పెద్దపల్లి ప్రజలకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చైర్మన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ లైసెట్టి బిక్షపతి, పైడా రవి, పాగాల శ్రీకాంత్, నాంసాని సర్వేష్ బాబు, సాబీర్ ఖాన్, దేవనంది దేవరాజ్, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు కొయ్యడ సతీష్ గౌడ్, వెన్న రవీందర్, కాశి పాక వాసు, బొంకూరి అకిల్, చొప్పరి అన్వేష్, బొంకూరి మధు, అరికెళ్ల ప్రసాద్, బాలసాని నరేష్, కళ్యాణ్, ఆవుల సంతోష్, సముద్రాల రాజ్ కుమార్, సుధగోణి సంతోష్, తక్దిర్,సతీష్ తో పాటుగా కార్ అసోసియేషన్ మరియు వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, బిఆర్ఎస్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page