SAKSHITHA NEWS

ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్వర్యంలో..
చౌటుప్పల్ లో జోరుగా టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం

సాక్షిత : *మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 13 వార్డుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గత పది రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు నేరుగా వివరిస్తూ, ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధిస్తే నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని సైతం వివరిస్తున్నారు. ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రతి రోజూ, ప్రతి గల్లీలో ప్రజలతో నేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి, టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో స్వయంగా చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలను విశ్వసించే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు.


SAKSHITHA NEWS