SAKSHITHA NEWS

వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ దగ్గర మోజెస్ ఆధ్వర్యంలో ఆచార్యులు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ శ్రీమతి మాధవరం రోజా దేవి రంగారావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. అయినా ప్రత్యేక రాష్ట్ర పోరాటం లోఅలుపెరుగకుండా పాల్గొన్నారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు,డివిజన్ అధ్యక్షులు సంజీవరెడ్డి,ఆంజనేయులు,గిరిబాబు,రాములు, వీరాంజనేయ చారి, శ్రావణి రెడ్డి,స్వరూప,మధు,బాబు, శివ,చంద్రమోహన్ సాగర్, విద్య సాగర్, సోమేశ్, అర్జున్,తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS