SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని బాలానగర్ బోయిన్పల్లి మూసాపేట్ డివిజన్లలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ అని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఉంది అని దీనికి ఆయన చూపిన మార్గం మనందరికీ ఆదర్శమని ఆ మహనీయుడు మన మధ్య లేక పోవడం దురదృష్టమని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాన్నడని ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు..

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి.. ముద్దం నరసింహ యాదవ్.. మాజీ కార్పొరేటర్లు నరేంద్ర చారి.. తూము శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు


SAKSHITHA NEWS