నూతన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని MLC శంభిపూర్ రాజు కి వినతి….

Spread the love

నూతన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని MLC శంభిపూర్ రాజు కి వినతి….
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని బొడ్డురాయి నుండి ప్రగతినగర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ వరకు గల రోడ్డు చాలా సంవత్సరాల క్రితం వేయబడింది. ప్రస్తుతం పడుతున్న వర్షాల కారణంగా పూర్తిగా చెడిపోయి, వాహన దారులకు, స్కూల్ పిల్లలకు, మరియు అన్ని రకాల పనులకు వెళ్లే ప్రయానికులందరికి చాలా ఇబ్బంది కరంగా మారడంతో నూతన బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చూపెట్టవలసిందిగా భౌరంపేట్ గ్రామ నాయకులు మేడ్చల్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, MLC శంభిపూర్ రాజు కి వినతిపత్రాన్ని అందచేసారు. స్పందించిన MLC త్వరలోనే రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి , దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి , బుచ్చిరెడ్డి , మురళీ యాదవ్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page