శ్రీశ్రీశ్రీ గాలి పోచమ్మ దేవతా విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Spread the love

శ్రీశ్రీశ్రీ గాలి పోచమ్మ దేవతా విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

*
సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్* లింగంపల్లి విలేజ్ మాట్రిక్స్ ఆర్చిడ్స్ అపార్ట్మెంట్ ఎదురుగా నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గాలి పోచమ్మ టెంపుల్, విగ్రహ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో పాటు స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్పొరేటర్ ని, ఎమ్మెల్యే ని వేద మంత్రాల ఉచరణతో ఘనస్వాగతం పలికి, శాలువాతో సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు యాదగిరి గౌడ్, ఆహ్వానితులు నరసింహ గౌడ్, మరియు మాట్రిక్స్ ఆర్కిడ్స్ కుటుంబ సభ్యులు, మహిళలభక్తులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page